- పవిత్రత అపవిత్రత అన్నభావాల్ని మనసులోజొరనీయక సదా భగవన్నామా స్వాదనలో మత్తిలి ఉండుటయే స్వధర్మం.
- భగవన్నామం చేస్తే - మంత్ర జపం చేసిన ఫలం, యజ్ఞయాగాదులు, వ్రతాలు, తపస్సులు చేసిన ఫలమూ ప్రాప్తిస్తుంది.
- భగవంతుని నామంలో అచ్చమైన మాధుర్యమున్నది. భగవంతునిలో భయ విస్మయాల్ని కలిగించే గుణాలున్నాయి. అందువల్ల అతని నామం అతనికంటే ఎంతో మధురం.
- నామజపం చేయండి. భక్తుల్ని సేవించండి. జీవులుపట్ల దయ జూపండి. దయగల హృదయమే భగవన్నిలయం.
- ఇంద్ర చంద్రాది దేవతలంతా తల్లి శరీరంలో కేంద్రీకృతమై ఉన్నారు. కనుక తల్లిదండ్రులను గౌరవించటం ప్రతివారి కర్తవ్యం.
- భార్య సహధర్మచారిణి కానీ కేవలం భోగ వస్తువు కాదు. ధర్మార్ధకామ మోక్షాలలో ఆమెను అలా గౌరవించాలి.
- పవిత్రమైన నిస్వార్ద ప్రేమ మత్రమే భగవంతడిని కొనగలుగుతుంది. ప్రాపంచిక వస్తువుల మీద ప్రేమ కామం వంటిది. కామం-ఇనుము వంటిది. ప్రేమ-బంగారం వంటిది. కనుక సర్వజగత్తును భగవద్రూపంగా నిస్వార్దంగా ప్రేమించి భగవంతుణ్ణి పొందండి. ప్రేమకు మారు రూపం భగవంతుడే.
- బానిసకు బాధలెక్కువ. స్వతంత్రుడికి బాధ్యతలెక్కువ.
- కష్టపడి పనిచేయడం భగవంతునికి శరీరం చేసే ప్రార్ధన.
- శక్తిసంపన్నులకు, మహాత్ములకు కార్యసాదనకు ఆడంబరమైన సాధన సంపత్తితో పనిలేదు. పనిచేయటయే వారిపని.
- ఆదర్శాలు గొప్పవైనంత మాత్రాన ప్రయోజనం ఏమిటి? వాటిని ఆచరణలో పెట్టినప్పుడే సార్దకత. ఆచరణే ప్రధానం.
- ఎదురుచూస్తూ కూర్చోవడం కాదు. ఎదురు నడుస్తూ పోవడమే కర్తవ్యం. కర్తవ్యానికి వెనుకడుగులుండవు.
- బాధనుండి మనిషి చేసే కృషికి విలువ పెరుగుతుంది.
- అద్భుత విజయం వెనుక రహస్యం కేవలం కష్టించి పనిచేయడమే.
- చాలామంది వ్యక్తులు పుణ్యఫలమైన సుఖాన్ని కాంక్షిస్తారే కాని పుణ్యకార్యాలు చేయడానికి ప్రయత్నించరు.
- ఇతరులలో నీవు ఎత్తి చూపే లోపం నీలో లేకుండా చూసుకో.
- ఒప్పు ఏమిటో చేప్పే పరిజ్ఞానం ప్రతివారికీ లేకపోవచ్చు గాని, తప్పును గుర్తించగల జ్ఞానం అందరికి ఉంటుంది.
- కష్టాలలోనే కటిక నిజాలు భోధపడుతూ ఉంటాయి.
- ఏపనినైనా మూడుగంటలు ముందు చేయడంలో తప్పు లేదు కాని ఒక్కక్షణంకూడా ఆలస్యం చేయకూడదు. అలస్యం అమృతం విషం.
- ఇతరుల కొరకు జీవించేవారే నిజంగా జీవించేవారు. మిగిలిన వారు మృతప్రాయులే. పరోపకారారైయిదం శరీరం.
- లాభం పొందడానికి అసలైన మార్గం అత్యాశ వదులుకోవడమే దురాశ దఃఖమునకు చేటు.
- ఈ ప్రపంచంలో సాదారణంగా సత్పురుషులే ఎక్కువ బాధలు అనుభవిస్తారు. పడ్డవారు చెడ్డవారు కాదు.
- వ్యక్తిగత ఇష్టాయిష్టాలను అదిగమించి అసత్యన్ని ఎదుర్కోనడమే మానవుడి కర్తవ్యం. సత్యమేవజయతే!
- మనస్సు, వాక్కు, శరీరం - ఈ మూడింటి మధ్య ఏకత కుదిరినప్పుడే సత్పురుషుడు కాగలడు. అదియే త్రికరణ శుద్ధి.
- ఉన్నత మనస్కుడు ఒకరిని అవమానించడు. అవమానాన్నిసహించడు. అతడే అసలైన ఆత్మాభిమాని.
- అసూయ, అత్యాశ, కోపం, పరుషమైనమాట - ఈ నాలుగు వదిలిపెట్టినవాడే సజ్జనుడు. సజ్జనుల లక్ష్యనమిధియే.
- తప్పులనుంచి, లోపాలనుంచి భవిష్యత్తుకు పనికొచ్చే పాఠాలు నేర్చుకోవడం వివేకవంతుల లక్షణం. అనుభవం
ఒక పాఠశాల వంటిది. అందరం అందులో విధ్యర్ధులే.
(ఈ అమృత బిందువులు మనకు బి.సేతురామన్ గురుస్వామి గారు అయ్యప్ప విజయం అనే బుక్ లొ ప్రచురించారు)
|